ఏపీలో తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో కోర్ కమిటి సమావేశమైంది. హైదరాబాద్లోని కన్నా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీశ్ జీ, కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి, పురందేశ్వరి, హరిబాబు, సోము వీర్రాజు హాజరయ్యారు.