కర్నూలులో కిడ్నాప్ డ్రామాకు చెక్ ..తిరిగి కన్నవారికి బిడ్డ అప్పగింత

Update: 2019-07-24 06:49 GMT

కర్నూల్లో కిడ్నాప్ ‌డ్రామాకు పోలీసులు చెక్ పెట్టారు. కర్నూలు శ్రీనగర్ ‌కాలనీకి చెందిన వెంకటాచలం భార్య విజయకుమారి నంద్యాల ఆసుపత్రిలో మూడు నెలల క్రితం డెలివరీ అయింది. మగ బిడ్డ పుట్టి చనిపోయింది. అయితే అదే ఆసుపత్రిలో పద్మావతికి మగ్గ బిడ్డకు పుట్టింది. వారితో తమ సమస్యను చెప్పుకుని మగ బిడ్డను దత్తత తీసుకున్నారు. తమకే మగ బిడ్డ పుట్టిందని చెప్పుకుని సంతోషంగా ఉన్నారు వెంకటచలం, విజయకుమారి దంపతులు.

అయితే బిడ్డపై మమకారం చంపుకోలేకపోయారు వెంకటస్వామి, పద్మావతి. తమ బిడ్డను తమకు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బిడ్డను వారికి అప్పగించారు. ఈ విషయం బంధువులకు తెలిస్తే పరువు పోతుందని భావించిన విజయకుమారి దంపతులు బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును విచారించడంతో అసలు విషయం బటయపడింది.

Full View  

Tags:    

Similar News