మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు గౌతమ్కు చెందిన షోరూమ్ను అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కోర్టు ఆదేశాలతో సోదాలు చేపట్టిన అధికారులు అసెంబ్లీకి చెందిన 10 కుర్చీలు స్వాధీనం చేసుకున్నారు. యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న ఫర్నీచర్ అని అసెంబ్లీ అసిస్టెంట్ రాజ్కుమార్, ఎమ్మార్వో మోహన్ రావు తెలిపారు. అయితే అసెంబ్లీకి చెందిన కోటి రూపాయల విలువైన ఫర్నీచర్ కోడెల దగ్గర ఉందని షోరూమ్ 3, 4 ఫ్లోర్ తాళాలు తీయడం లేదని చెబుతున్నారు. అక్కడ కూడా సోదాలు చేస్తే మిగతా ఫర్నీచర్ కూడా దొరుకుతుందని వివరించారు.