ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శాసననసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ ప్రాంగణంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన అధ్యక్షుడు పాలవలస విక్రాంత్ అభినందన సభను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ.. పాలనా సంస్కరణలతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ చర్యలు చేపట్టాడంటూ సీఎం వైఎస్ జగన్ను కొనియాడారు. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటు పడతున్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ నినదించారు. ఇన్సైడర్ ట్రేడింగ్లో సంపాదించుకున్న భూముల రేటు తగ్గిందని చంద్రబాబు ఉద్యమాలు చేస్తున్నారంటూ విమర్శించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అంగీకరిస్తారో లేదా చెప్పాలంటూ చంద్రబాబును డిమాండ్ చేశారు.