AP High Court: వైఎస్ వివేకా హత్యకేసు.. ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

Update: 2020-03-11 09:19 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకనందా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసు దర్యాప్తులో పురోగతి లేదని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగించినట్లు స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వివేక్ భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, బీటెక్ రవి, వివేక అల్లుడు వేసిన పిటిషన్లకు హైకోర్టు ఈ తీర్పు ను వెల్లడించింది.

Full View


Tags:    

Similar News