ఇసుక విషయంలో ఏపీ సర్కారు ప్రజలను దోచుకుంటుంది : పవన్ కల్యాణ్

Update: 2019-09-13 13:15 GMT

ఇసుక విషయంలో ఏపీ సర్కారు ప్రజలను దోచుకుంటుందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌పరెన్సీ కోసమే కొత్త ఇసుక విధానం అని చెప్పిన ప్రభుత్వం.. చెప్పిన రేటుకే అమ్మకం చేపట్టాలని పవన్ డిమాండ్ చేశారు. టన్ను ఇసుక 370 అని చెప్పి.. అదనంగా 525 రూపాయలు వసూలు చేస్తున్నారని.. దీంతో టన్ను ఇసుక కోసం 900 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకే ఆకస్మిక తనిఖీలు చేప్టటినట్లు వివరించారు. మంగళగిరిలోని నవులూరులోని ఇసుక రీచ్‌ను పరిశీలించిన పవన్‌.. అన్ని వివరాలపై రేపు కూలంకషంగా స్పందిస్తానని తెలిపారు.  

Tags:    

Similar News