కోడెల శివప్రసాదరావు కుమారుడికి అధికారులు షాక్‌

Update: 2019-08-10 08:35 GMT

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్‌కు చెందిన గౌతం హోండా షోరూమ్‌ను సీజ్ చేశారు ఏపీ ఆర్టీఏ అధికారులు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. దీంతో నరసరావుపేట, గుంటూరులోని రెండు షోరూమ్‌లను అధికారులు సీజ్‌ చేశారు.

Tags:    

Similar News