ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు

Update: 2019-06-13 08:50 GMT

ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం నెలకొంది. స్పీకర్‌ ఎన్నిక అనంతరం వైఎస్ జగన్ గతంలో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయం గురించి మాట్లాడారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. 1978లో గెలిచిన నాలుగు రోజులకే వైఎస్ పార్టీ మారారు ఈ విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు చంద్రబాబు. స్పీకర్ ఎన్నికలో చిన్న వివాదం కాకుండా ఉండాలని అనుకున్నామని చెప్పారు. అడుగడుగునా ప్రతిక్షాన్ని కించపర్చారన్నారు చంద్రబాబు. "హత్యలు చేసినవాడిని హత్య చేయడం తప్పుకాదన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది. గతంలో విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు తప్పును ఒప్పుకోకుండా అనవసర విషయాలు చెబుతున్నారు. చంద్రబాబు మాటలు వింటే ఆశ్చర్యంగా ఉంది. అవకాశం ఇస్తే చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ చెప్పిన మాటలను సభలో వినిపిస్తాను" అని చంద్రబాబుకు జగన్ కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News