గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులు... సీఎం జగన్ కీలక నిర్ణయం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున సంగతి తెలిసిందే.. దీనితో ఆంధ్రప్రదేశ్ కి చెందిన 5 వేల మంది
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున సంగతి తెలిసిందే.. దీనితో ఆంధ్రప్రదేశ్ కి చెందిన 5 వేల మంది మత్స్యకారులు గుజరాత్ లోని వెరావల్లో చిక్కుకపోయారు. అక్కడ వారు పడుతున్న భాధలను ఏపీ ప్రభుత్వానికి వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ చిక్కుకున్న వారికి సహాయం చేయాలనీ ఆధికారులను ఆదేశించారు.. దీనితో అధికారులు శ్రీకాకుళం నుంచి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుజరాత్కు పంపించారు. ప్రస్తుతం జాలర్లకు వసతి, ఆహారంతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది.