కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

ఏపీలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

Update: 2020-03-20 15:19 GMT
Alla Nani (File Photo)

ఏపీలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు అనుక్షణం అలెర్ట్ గా ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయని.. వైరస్ విజృంభించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఈ నెల 22న ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూకు రాష్ట్ర ప్రజల సహాకారం ఉంటుందని ఆళ్లనాని తెలిపారు..


Tags:    

Similar News