అమరావతి రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తు్న్నారు. రేపటి నుంచి రాజధాని గ్రామాల్లో సకలజనుల సమ్మెకు పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మెకు వర్తక, వ్యాపార, విద్యా సంస్థలు , బ్యాంకులు, ప్రభుత్వ కార్యాయాలు సహకరించాలని కోరారు. ప్రజలు సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు.
రాజధాని కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు రాజధాని పరిరక్షణ జేఏసీ ప్రకటించింది. అమరావతి చుట్టపక్కల ఉన్న 29 గ్రామాల్లో సకలజనుల సమ్మె ప్రభావం ఉండనుంది. కాగా రాజధానిపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. శుక్రవారం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తమ నివేదికను సీఎం జగన్ను ఇవ్వబోతోంది. అన్నింటిని సమీక్షించిన అనంతరం రాజధానిపై తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.