రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు మండిపడ్డారు. పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. రైతులను కించపరిచిన పృథ్వీరాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అమరావతి రాజధానిలో రైతుల ఆందోళనలు 23వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు నిరాహారదీక్షలు చేపట్టారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రైతులు నిరసనకు దిగారు. మందడం, తుళ్లూరులో రైతుల నిరసనలకు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సంఘీభావం తెలపనున్నారు.