అమరావతిలో ఇవాళ టీడీపీ నేతలు మరోసారి సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమై పార్టీలో వలసలపై చర్చించనున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ రూపొందించబోతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. పార్టీ వలసలపై చర్చించడంతో పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు నేతలు కార్యాచరణ రూపొందించనున్నారు.