ఏపీలో నిన్న రాత్రి 9గంటల నుంచి ఒక్కసారిగా 17 కొత్త కేసులు నమోదుకావడం చర్చనీయాంశమైంది. బాధితుల్లో దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే ఎక్కువమంది ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది.
ఏపీ నుంచి ఢిల్లీకి 369 మంది మతపరమైన ప్రార్థనల కోసం వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. వీరంతా మార్చి 15 నుంచి 17వరకు అక్కడే ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ వెళ్లిన వారి వివరాలు జిల్లాల వారీగా ..