స్థానిక సమస్యలపై జనసేన పోరాటం చేస్తుంది: జేడీ లక్ష్మీనారాయణ

Update: 2019-06-23 09:52 GMT

ప్రజలు ఆధ్యాత్మిక దిశగా నడవాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ నేత జేడీ లక్ష్మీనారాయణ. గుంటూరు జిల్లా చుండూరు మండలం మండూరులో వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ పున ప్రతిష్ట కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆద్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి జనసేన పోరాటం చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అవినీతి, రాజకీయాల్లో డబ్బు ప్రభావం లేకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని అన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు

Tags:    

Similar News