ఆర్టీసీని కాపాడుకుంటాం - మంత్రి ఎర్రబెల్లి

ఆర్టీసీని కాపాడుకుంటాం - మంత్రి ఎర్రబెల్లి
x
Highlights

♦ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు - ఎర్రబెల్లి ♦ బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో ఎక్కడా విలీనం జరగలేదు-ఎర్రబెల్లి ♦ రాజకీయ లబ్ది కోసమే సమ్మెకు విపక్షాల మద్దతు - ఎర్రబెల్లి

ఆర్టీసీని కాపాడుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. తామెప్పుడూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదన్నారు.ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రచారం చేసి కొన్ని పార్టీలు కార్మికులను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్సడిన తర్వాత ఆర్టీసీకి కేసీఆర్‌ రూ.8,808 కోట్ల సహాయం అందించారన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేశారా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఈ సమ్మెకు పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని ఎర్రబెల్లి ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories