నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుందాం : ఎంపీ సంతోష్‌

నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుందాం : ఎంపీ సంతోష్‌
x
Joginapally Santosh Kumar
Highlights

సరిగ్గా ఈ ఏడాదికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 20 ఏండ్లు నిండనుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఘనంగా జరుపుకుంటారు.

సరిగ్గా ఈ ఏడాదికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 20 ఏండ్లు నిండనుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఘనంగా జరుపుకుంటారు.కానీ ఈ ఏడాది మాత్రం అది సాధ్యమయ్యేలా లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి దేశమంతటా లాక్ డౌన్ ను అమలు చేసింది. దీంతో పార్టీ ఆవిర్భావ పండుగను సాదాసీదాగా జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకుని, సామాజిక హితానికి పాల్పడదాం అంటూ పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కులు ధరించాలని అంతే కాకుండా ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మాస్కులు పంపిణీ చేసే సమయంలో ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని సూచించారు. టిఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని సూచించేలా కేసీఆర్ చిత్ర పటంతో తయారు చేసిన మాస్క్ లను తయారుచేసి, పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు ఫోటోలు దిగి తనకు షేర్ చేయాలని సంతోష్ కుమార్ పార్టీ శ్రేణులకు, పార్టీ నాయకులకు సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories