జీవో 3 పై రివ్యూ పిటిషన్ వేస్తాం : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

జీవో 3 పై రివ్యూ పిటిషన్ వేస్తాం : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
x
Highlights

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లో నందన గార్డెన్స్ లో శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లో నందన గార్డెన్స్ లో శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవో 3పై గిరిజనులకు అనుకూలమైన తీర్పు వచ్చేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో పోరాటం చేస్తామని ఆమె తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలను వందశాతం వారితోనే భర్తీచేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో 3ని సుప్రీం కోర్టు కొట్టివేయడంపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి సుప్రీం కోర్టు న్యాయమూర్తులను, న్యాయ సలహాదారులతో మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలోఈ జీవో 3ని కొనసాగించేందుకు రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.

కేంద్ర మంత్రి తో ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు జీవో నెంబర్ 3ని కొట్టివేయడంపై రివ్యూ పిటిషన్ వేస్తున్నాం సహకరించాలని కోరామని ఆమె తెలిపారు. ఈ విషయంలో గిరిజనులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులను పెట్టుకుని, న్యాయ నిపుణుల సలహా తీసుకుని తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి రివ్యూ పిటిషన్ వేయబోతున్నామన్నారు. ఈ జీవోను కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇస్తున్నాను.

ఇక లాక్ డౌన్ నేపథ్యంలో మన రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది వలస కూలీలు చిక్కుకు పోయారని తెలిపారు. వీరందరినీ వారి వారి రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. దాంతో పాటుగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై మహబూబాబాద్ కలెక్టర్ , అధికారులతో మంత్రి సత్యవతిరాథోడ్ సమీక్ష చేశారు. మానుకోట జిల్లానుంచి సుమారుగా 10వేల మంది వలస కూలీలున్నారన్నారు. వీరందరినీ తమ గ్రామలకు పంపే ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.

ప్రజలకు అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు అందిస్తూ, రైతు పండించిన పంట దళారుల చేతికి వెళ్లకుండా కొనుగోలు చేస్తూ వారిని ఆదుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories