స్కూల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..

స్కూల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..
x
Highlights

ఖమ్మం జిల్లాలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ దారుణంగా మృతి చెందింది.

ఖమ్మం జిల్లాలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ దారుణంగా మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల్లోకెళితే ఖమ్మం జిల్లాలోని ఓ పాఠశాలలో ట్రాక్టర్ దూసుకుపోయింది. మధిర మండలం రామచంద్రపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

ఏవేవో పనుల నిమిత్తం పాఠశాల ఆవరణంలో తిరుగుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో ఆ ట్రాక్టర్ పాఠశాల గోడలను బద్దలు కొట్టుకుని లోపలికి చొచ్చుకుపోయింది. దీంతో అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు భోజనం వండుతున్న మహిళ అక్కడికక్కడే తన ప్రాణాలను కోల్పోయింది. దీంతో అక్కడున్న స్కూలు విద్యార్థులంతా ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు పరుగులు తీసారు. తమ పిల్లలు ఏమైనా అపాయం జరిగిందేమో అని ఖంగారు పడ్డారు. కానీ పిల్లలకు ఎలాంటి దెబ్బలు తగలక పోవడంతో ఊపిరి పీల్చుకున్న వారు వంటమనిషి ప్రాణాలు పోవడంతో దుఖంలో మునిగిపోయారు. అయితే ఈ ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదసంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసునమోదుచేసుకుని, ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories