Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడువు

The Deadline for Receipt of Nomination for the Munugodu By-Election Ends Today
x

Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడువు

Highlights

Munugodu Bypoll: ఇప్పటి వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్ దాఖలు

Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక 17వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. నవంబర్ 3న పోలింగ్ కాగా నవంబర్ 6న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితం వెల్లడించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. చండూరు తహశీల్దార్ కార్యాలయంలో పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయనున్నారు. భారీగా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. బంగారుగడ్డ గ్రామం నుంచి చండూరు ఎమ్మార్వో కార్యాలయం వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది. పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories