వేతనాల కోత నుంచి మూడు శాఖలకు మినహాయింపు..

వేతనాల కోత నుంచి మూడు శాఖలకు మినహాయింపు..
x
Highlights

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలను తీసుకుంటుంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితుల సహాయార్థం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. అయితే వేతనాల్లో కోత నుంచి అత్యవసర పరిస్తితుల్లో పని చేస్తున్న మూడు శాఖల ఉద్యోగులను మినహాయించిందని ప్రభుత్వం ప్రకటించింది.

ఆ మూడు శాఖల్లో పోలీస్ శాఖ, వైద్యారోగ్య శాఖ, పారిశుద్య కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి పూర్తి వేతనాలు అందనున్నాయి. అయితే సోమవారం తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు... ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు నిర్ణయించారు. అంతేకాకుండా తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ముఖ్యమంత్రి, రాష్ర్ట మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు. ఇక ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత ఉంటుంది. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. ఇక అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత ఉంటుంది. నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత ఉండగా,మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories