మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్‌

మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్‌
x
Highlights

గోదావరి జలాలతో జలకళ సంతరించుకున్న మేడిగడ్డ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. గోదావరి మాతకు పూలు, పట్టు వస్త్రాలు సమర్పించి...

గోదావరి జలాలతో జలకళ సంతరించుకున్న మేడిగడ్డ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. గోదావరి మాతకు పూలు, పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ.. ఏరియల్ సర్వే ద్వారా మేడిగడ్డ బ్యారేజి పరిసరాలను పరిశీలించారు. మేడిగడ్డలో గోదావరి ప్రవాహ ఉధృతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్‌, వంతెనపై నుంచి దిగువకు విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. హెలికాప్టర్‌లో ఉన్న మిగతా వారితో సక్సెస్ అన్నట్లు సంకేతం చూపుతూ సంబురపడ్డారు. మొత్తం 140 కిలోమీటర్ల మేర జగిత్యాల జిల్లా ధర్మపురి వరకు సందర్శన సాగనుంది. నేటి మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్మపురికి వస్తారు. ధర్మపురిలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories