సింగరేణిలో సెగ... యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం

సింగరేణిలో సెగ... యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం
x
Highlights

సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను సంప్రదించకుండా యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను సంప్రదించకుండా యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను సంప్రదించకుండా యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కార్మికుల ఒక రోజు వేతనాన్నివారి అనుమతి లేకుండా ప్రభుత్వానికి విరాళంగా యాజమాన్యం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఆ తరువాత ప్రభుత్వం ఏకంగా కార్మికుల వేతనాల్లో 50శాతం కోత విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు.

అన్ని శాఖల్లో ప్రకటించనట్టుగానే గనుల్లో కూగా లాక్ డౌన్ ప్రకటించాలని, లే ఆఫ్ తీసివేయాలని కోరారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 15వ తేది సమ్మె చేపతామని కార్మికులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన నోటీస్ ని గురువారం సీఎండీకి ఇచ్చారు.

కరోనా వైరస్ వలన లాక్ డౌన్ ప్రకటించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు-కార్మికులకు పూర్తి జీతం ఇస్తే అండర్ గ్రౌండ్ మైన్స్‌ కార్మికులకు సగం జీతంతో కూడిన లే ఆఫ్ ప్రకటించడం అన్యాయం అని తెలిపారు. ప్రభుత్వం ఆదేశించినట్టుగానే లాక్ డౌన్ ప్రకటించాలే కానీ లే ఆఫ్ చేయకూడదంటున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో డబ్బు లేనందువలన ఉద్యోగులకు వేతనంలో 50శాతం కోత విధించడం అన్యాయం అని, సింగరేణికి దానికి సంబంధం లేదంటున్నారు. సింగరేణి బొగ్గు అమ్మిన డబ్బుల నుంచే కార్మికులకు వేతనం ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదంటున్నారు.

15 రోజులుగా కార్మికులు ప్రాణాలకు తెగించి పోలీసులు కొట్టినా డ్యూటీ చేశారని చెప్పారు. కోల్ ఇండియాలో అనుమతి ఇచ్చిన కార్మికుడి ఒక్క రోజు వేతనం ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. కానీ సింగరేణి కార్మికులను సంప్రదించకుండానే యాజమాన్యం ఒక్క రోజు వేతనాన్నిసీఎం సహాయనిధికి ఇచ్చిందని, అసలు మొత్తం రూ. ఏడు కోట్ల 50 లక్షలు ఉంటుందన్నారు.

కార్మికులను సంప్రదించకుండానే ఒక్క రోజు వేతరం ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం కూడా కార్మికుల జీతం కట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించకుంటే 15-4-2019 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories