సింగ‌రేణి పేలుడు ఘ‌ట‌న: యాజ‌మాన్యం‌పై మృతుడి భార్య ఫిర్యాదు

సింగ‌రేణి పేలుడు ఘ‌ట‌న: యాజ‌మాన్యం‌పై మృతుడి భార్య ఫిర్యాదు
x
Highlights

రామగుండం సింగరేణి ఓసిపి వన్ లో మంగళవారం జరిగిన పేలుళ్ల సంఘట‌న‌పై.. ఆ ప్రమాదంలో మ‌ర‌ణించిన కార్మికుని భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

రామగుండం సింగరేణి ఓసిపి వన్ లో మంగళవారం జరిగిన పేలుళ్ల సంఘట‌న‌పై.. ఆ ప్రమాదంలో మ‌ర‌ణించిన కార్మికుని భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.యాజమాన్యం రెగ్యులర్ గా చేసే పనికి బదులు మరో పని చేయించడం వల్లనే పేలుడు సంభవించి నలుగురు వ్యక్తులు చనిపోయారని మృతుడు బిళ్ళ రాజేశం భార్య ధనలక్ష్మి రామ‌గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ‌ఆర్జీ-3 జనరల్ మేనేజర్, ఓసీపీ 1 డిప్యూటీ మేనేజర్, సైట్ ఇంచార్జ్, ఓబీ ఇంచార్జ్, ప్రాజెక్టు ఆఫీసర్, ఫోర్ మెన్, మహాలక్ష్మి యాజమాన్యం పై పోలీసులు ‌కేసు నమోదు చేశారు.

వ్యవసాయం చేసే బిళ్ల రాజేశం.. కూతుళ్ల పెళ్లి కోసం వ్యవసాయం వదిలి ఓబీ సంస్థలో కార్మికునిగా చేరాడు. పెద్ద కూతురు మధుప్రియకు వివాహం చేయగా, చిన్న కూతురు మానసకు కూడా మంచి సంబంధం తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాడు. ప్రమాదంలో రాజేశం మృతిచెందడంతో భార్య బిడ్డలు క‌న్నీరు మున్నీరు గా విల‌పిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories