ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారతీరావు అరెస్ట్

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారతీరావు అరెస్ట్
x
ప్రణయ్, అమృత, మారుతీ రావు
Highlights

గతేడాది తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కులదురహంకార హత్య సంచలాన్ని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రణయ్ హత్య...

గతేడాది తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కులదురహంకార హత్య సంచలాన్ని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందుతులైన మారుతీరావు, ఎంఏ కరీంలపై మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం మరో సారి కేసు నమోదైంది.

మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల్లోకెళితే ప్రణయ్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన అమృత వర్షిణిని తనకు అనుకూలంగా సాక్షం చెప్పాలని అమృత తండ్రి మారుతీరావు, అతనికి సహకరించిన కరీంలు బెదిరిస్తున్నారని తెలిపారు.

ఇదే క్రమంలో కొన్ని రోజల క్రితం మారుతీ రావుకు బాగా సన్నిహితుడైన కందుల వెంకటేశ్వరరావును మత్తిరెడ్డికుంటలోని అమృత ఇంటికి రాయబారానికి పంపించాడు. తన తండ్రి చెప్పినట్లు నడుచుకుంటే ఆస్తినంతా నీకు రాసిస్తానంటున్నాడని, తన తండ్రికి నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలని వెంకటేశ్వరరావు అమృతను ప్రలోభపెట్టాడని తెలిపారు.

ఈ విషయాన్ని విన్న అమృత ససేమిరా అని ఈనెల 11న మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ జరిపించి మారుతీరావు, కరీం, వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. అనంతరం మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి సబ్‌ జైల్‌కు తరలించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories