9 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి.. రిపోర్టులో బయటపడ్డ నిజం

9 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి.. రిపోర్టులో బయటపడ్డ నిజం
x
Representational Image
Highlights

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో బావిలో 9మంది మృతదేహాలు లభ్యం అయిన విషయం తెలిసిందే.

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో బావిలో 9మంది మృతదేహాలు లభ్యం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ కేసులో మృతి చెందిన వారి పోస్టుమార్టం కోసం ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు మృతుల పోస్టుమార్టంను పూర్తి చేసి రిపోర్టులను బయట పెట్టారు. ఈ రిపోర్టుల్లో మృతులంతా బతికి ఉండగానే బావిలో పడినట్లు వెల్లడైంది. అయితే మృతులు వారంతట వారే నీళ్లలోకి దూకారా? లేదంటే ఎవరైనా కావాలనే వాళ్లని బావిలోకి తోసేశారా అనేది నిజాలు బయటికి రావాల్సి ఉంది. కాగా ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే యాకూబ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అతడితోపాటు బిహర్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ కేసులో వీరు చెప్పే నిజాలతో పాటు ఫోన్ కాల్స్ కూడా కీలకం కానున్నాయి. ఇప్పటికి ఇద్దరి ఫోన్లను లభ్యం చేసుకున్న పోలీసులు మరో ఏడుగురి సెల్ ఫోన్ల కోసం గాలిస్తున్నారు. నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలు బయటపడ్డాయి. నిన్న నాలుగు మృతదేహాలు, నిన్న మరో ఐదు మృతదేహాలు గుర్తించారు. ఇందులో ఆరుగురు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగతా వారిలో ఇద్దరు బిహార్‌, ఒకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు.

పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం.. ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో నివాసముంటూ చినిగిన బస్తా సంచులు(బార్‌దాన్‌) కుడుతూ పొట్ట పోసుకుంటున్నారు. దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చిన ఆ కుటుంబంలోని నలుగురు బావిలో.. గురువారం మృతదేహాలుగా తేలారు. ఎవరైనా హత్య చేశారా.. వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. అందుకు కారణాలేమై ఉంటాయి.. అనే విషయంలో స్పష్టత లభించడం లేదు.

మృతులు ఎండీ మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), బుస్ర కుమారుడు(3)‌గా గుర్తించారు. ఇవాళ లభ్యమైన ఐదు మృతదేహాలు షాబాద్‌(22), సోహైల్‌(20), బిహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్‌(22), శ్రీరామ్(20), వరంగల్‌ వాసి షకీల్ గా గుర్తించారు. ఘటనా స్థలిని వరంగల్‌ సీపీ రవీందర్‌, మేయర్‌ జి.ప్రకాశరావు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను వరంగల్‌లోని ఎంజీఎంకి తరలించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories