ప్రియాంక హత్యపై నీచమైన పోస్టులు పెట్టిన యువకులు

ప్రియాంక హత్యపై నీచమైన పోస్టులు పెట్టిన యువకులు
x
Highlights

ఓవైపు ఆమెపై జరిగిన దారుణంపై మండిపడుతుంటే కొందరు మాత్రం నీచమైన పోస్టులు పెట్టి ఆనందపడుతున్నారు.

హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ ఇంట్లో ఆడబిడ్డగా భావించి స్పందించారు.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బాధతో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో గొంతెత్తారు.

ఓవైపు ఆమెపై జరిగిన దారుణంపై మండిపడుతుంటే కొందరు మాత్రం నీచమైన పోస్టులు పెట్టి ఆనందపడుతున్నారు. స్మైలీ నాని అనే యువకుడు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ దారుణమైన రాతలు రాశారు. ఆమెను కించపరుస్తూ.. అత్యాచారానికి పాల్పడిన వారిని నెత్తికి ఎక్కించుకొని పోస్టులు పెట్టారు. వెంటనే స్పందించిన నెటిజన్లు కొందరు విషయాన్ని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలపై ఎవరైనా అసభ్యంగా పోస్టింగ్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. మొత్తం నలుగురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమర్ నాథ్, శ్రవణ్, సందీప్ కుమార్, స్మైలీ నానిగా వీరిని గుర్తించారు. నిందితులపై దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories