విమాన ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

విమాన ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
x
Highlights

లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన రవాణా వ్యవస్ధ ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అన్నీ రవాణా సౌకర్యాలను పురుద్దరిస్తున్నారు.

లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన రవాణా వ్యవస్ధ ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అన్నీ రవాణా సౌకర్యాలను పురుద్దరిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు నేటి నుంచి మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి విమానాలు రాకపోకలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల కోసం కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఓ నిర్ణయానికొచ్చారు. ప్రయానికులు రాగానే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉండాలని సూచించాయి.

ఈ రాష్ట్రాల నిర్ణయం తెలుసుకున్న ప్రజలు తెలంగాణ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురు చూశారు. వారు ఎదురు చూసినట్టుగానే తెలంగాణ సర్కార్ కూడా ప్రయాణికుల విషయంలో ఓ క్లారిటీకి వచ్చింది. తమ రాష్ట్రానికి వచ్చిన విమాన ప్రయాణికులకు కరోనా లక్షణాలేవీ లేకపోతే 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని ఆదివారం రాత్రి స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఎవరికైనా కరోనా లక్షణాలున్న కనిపిస్తే వారిని వెంటనే ఐసోలేషన్‌కు తరలిస్తామని, లక్షణాలు ఎక్కువగా ఉంటే కరోనా బాధితులకు చికిత్స అందిస్తోన్న ఆస్పత్రిలో చేర్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.

విమాన ప్రయాణం చేసేవారికి మాత్రమే కాకుండా రోడ్డు మార్గం, రైళ్లు మార్గం ద్వారా వచ్చిన వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో గర్భిణులు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచుతామని తెలిపారు. వారిని ఆరోగ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. వీరిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తరలిస్తారన్నారు. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం విమాన ప్రయాణం చేసిన తర్వాత 14 రోజులపాటు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలని సూచించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories