Jagga Reddy: టీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోంది

MLA Jagga Reddy Said there is a Secret deal Between TRS and BJP
x

Jagga Reddy: టీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోంది

Highlights

Jagga Reddy: అందుకే మునుగోడులు విచ్చల విడిగా డబ్బులు పంచుతున్నారు

Jagga Reddy: టీఆర్ఎస్ బీజేపీ ల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే ‎జగ్గారెడ్డి. మునుగోడులో పార్టీ టికెట్ పార్టీలో సీనియర్ నేతగా పేరొందిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు శ్రవంతికి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ అభ్యర్థి తరపున త్వరలో తాను ప్రచారానికి వెళతానన్నారు. అయితే సంగారెడ్డి మీదుగా రాహుల్ పాదయాత్ర ఉన్నందున ప్రీప్లాన్డ్ షెడ్యూల్ ప్రకారంర మునుగోడు ప్రచారం, యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నామన్నారు. అయితే స్టేట్ ఈసీ కేసీఆర్ చేతిలో సెంట్రల్ ఈసీ ప్రధాని మోడీ చెప్పుచేతుల్లో కొనసాగుతోందన్నారు. అందుకే 100 కోట్లు డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఆ డబ్బులు తీసుకుంటేనే కాంగ్రెస్ కు ఓటువేయాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories