తెలంగాణ శాసన మండలిలో ఆసక్తికర సంఘటన : క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ

తెలంగాణ శాసన మండలిలో ఆసక్తికర సంఘటన : క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ
x
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Highlights

తెలంగాణ శాసన మండలిలో గురువారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రజా ప్రతినిధులకు ఓ మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఆ మంత్రి ఎవరో కాదు కార్మిక శాక...

తెలంగాణ శాసన మండలిలో గురువారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రజా ప్రతినిధులకు ఓ మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఆ మంత్రి ఎవరో కాదు కార్మిక శాక మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌. ఈయన గురువారం జరిగిన శాసన మండలిలో ప్రతినిధుల ఫోన్లు చేస్తే ఆర్టీసీ అధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్న వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు కాల్ చేసినప్పుడు ఆర్టీసీ అధికారులు ఫోన్లు లిఫ్ట్‌ చేయకపోవడం, ప్రతినిధులకు సమాచారం అందించకపోవడం ముమ్మాటికీ తప్పేనని, అందుకు క్షమాపన చెబుతున్నానని ఆయన అన్నారు. ఇటీవలే బడ్జెట్ లో ఆర్టీసీ రెండు నెలల పాటు చేసిన సమ్మె కాలపు జీతాలు చెల్లించడానికి రూ. 235 కోట్లు విడుదల చేసిందని, ఇందుకు గాను ఆర్టీసీ జెఏసీ నాయకులే కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారని మంత్రి హర్షం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ చేస్తున్న కృషితో రోజుకు కోటిన్నర లాభం ఆర్టీసీ సంస్థకు వస్తోందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఆర్టీసీకి రూ. 11 కోట్ల ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ.12.50కోట్ల ఆదాయం వస్తుందని ఆయన స్పష్టం చేసారు. అవి మాత్రమే కాకుండా ఆర్టీసీ పార్సిల్‌ సర్వీసుల ద్వారా ఏడాదికి రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు.

ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్‌ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం రూ. 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని తెలిపారు. రెండు నెలల కాలం నుంచి ఆర్టీసీ ఉద్యోగుకలు ఆర్టీసీలో వచ్చే ఆదాయంతోనే జీతాలు చెల్లిస్తున్నామన్నామని స్పష్టం చేసారు. ఆర్టీసీ ఉద్యోగులతో ప్రతి ఒక్క అధికారి స్నేహపూర్వకంగా మెలగాలని ఆయన సూచించామని అన్నారు. ఇక పోతే ఆర్టీసీ సేవలను విస్తృతం చేసేందుకు గాను ఖమ్మం జిల్లా కేంద్రంలో జూలై నాటికి అధునాతన బస్టాండ్ ని రూ. 20 కోట్లతో నిర్మించనున్నామని తెలిపారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలో నెలాఖరుకు 100 కార్గో బస్సులు సిద్ధం చేస్తామని అన్నారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించమని ఆయన స్పష్టం చేసారు. ఇందులో భాగంగానే, మేడారం, బోగత, సోమశిల, తాడ్వాయి, నాగార్జున సాగర్ వద్ద కాటేజ్‌ల నిర్మాణం, బోటింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. అంతే కాక మేడారం, వేములవాడలకు జాతరల సందర్భంగా హెలీకాప్టర్ సేవలు అందించినట్టుగానే భద్రాచలం రాముని కల్యాణం సందర్భంగా కూడా హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ట్రై సిటీ గా పేరు పొందిన వరంగల్‌ను కూడా టూరిస్ట్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వస్తుందని, రామప్ప ఐలాండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories