78 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తున్నాం : మంత్రి హరీష్ రావు

78 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తున్నాం : మంత్రి హరీష్ రావు
x
మంత్రి హరీష్ రావు
Highlights

ఉగాదికి పైసా ఖర్చు లేకుండా పేదవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా...

ఉగాదికి పైసా ఖర్చు లేకుండా పేదవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం దుబ్బాకలో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలోనే మహిళా భవన నిర్మాణానికి హరీష్‌ రావు, ఎమ్మెల్యే రామలింగరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసి చెత్తను లేకుండా చేసి, స్వచ్చ దుబ్బాకగా తీర్చిదిద్దాలని అన్నారు. మహిళలకు రూ.50 లక్షల రూపాయలతో మహిళా భవనం శంకుస్థాపన చేశామని తెలిపారు. బస్తీలలోని ప్రతి ఇంటి ముందుకు చెత్త బండి ప్రతి రోజు రావాలని లేకపోతే కౌన్సిలర్ పదవి పోవుడేనన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, చెత్తను చెత్త బుట్టలలోనే పడేయాలని తెలిపారు. చెత్తను బయట పడేసిన వారికి అయిదు వందల రూపాయల ఫైన్‌ విధిస్తామని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు పని తగ్గాలంటే మనమంతా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు.

స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోవాలను కునే పేదవారు అధికారులకు లంచం ఇవ్వనవసరం లేదని అన్నారు. ఎవరైనా అధికారులు లంచం తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ప్రభుత్వం ఉన్న స్థలం ఉన్న వారికి తొందరలోనే డబుల్ బెడ్ రూంలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మంత్రి పేర్కొ‍న్నారు.

ఇక పోతే అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో స్మశాన వాటిక వద్ద మొక్కనాటిన మంత్రి హరీష్‌ రావు మొక్క సంరక్షణ కోసం పదివేల రూపాయలు అందజేశారు. అదే నేపథ్యంలోనే త్వరలోనే వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కట్టిస్తామని అందుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. దాంతో పాటుగానే ప్రతి నెల రూ. 78 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు ఉక్కపోతకు తట్టుకోలేక పోయేవారని, ఇప్పుడు ఎండాకాలం వస్తే కరెంట్‌ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories