రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగకు దేహశుద్ధి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగకు దేహశుద్ధి
x
Highlights

* పద్మానగర్‌లోని ఓ ఇంట్లో చోరీ * రూ.7 లక్షలు నగదు అపహరణ * స్థానికుల సహాయంతో దొంగను పట్టుకున్న బాధితులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దొంగకు దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. పద్మానగర్‌లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న దొంగ ఆ పక్క ఇంటినే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. ఇంట్లో వాళ్లంతా ఊరికి వెళ్లడం గమనించిన దొంగ దాన్నే అదనుగా భావించి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. స్థలం కొనుగోలు కోసం దాచిన 7 లక్షల నగదును అపహరించాడు. ఇక అదే సమయంలో ఊరికి వెళ్లినవారు తిరిగి రావడంతో వారిని చూసిన దొంగ పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికుల సహాయంతో దొంగను పట్టుకుని చితకబాదారు. అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories