తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణానికి గాను 750 కోట్ల నిధులను విడుదల చేసారు. ఈ క్రమంలోనే ఆలయ పునర్నిర్మాణ పనులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు.
ఈ ఆలయాన్ని మొత్తం రాతితోనే నిర్మించారు. దీనికి మొత్తంగా చూసుకుంటే రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్ను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకూ ఏ ఆలయాన్ని కూడా ఈ విధంగా రాతితో కట్టలేదని గ్రానైట్ తో కట్టిన అతిపెద్ద ఆలయంగా యాదాద్రి నిలిచిపోతుందని ఆయన తెలిపారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, ప్రాచీన కట్టడాల మాదిరిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించడం సీఎం కేసీఆర్ గొప్పతనమని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాబోయే 2000 ఏళ్ల వరకూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుందన్నారు. భారతదేశంలోనే ఇది ఒక గొప్ప అద్భుత కట్టడంగా నిలుస్తుందని ఆయన ట్వీట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
Renovated #Yadadri Lakshmi Narsimhaswamy Temple; yet another great initiative of Hon'ble CM #KCR Garu 🙏#Telangana pic.twitter.com/TqI4h3o3gS
— KTR (@KTRTRS) December 9, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire