Golkonda Mahankali Bonalu 2020: గోల్కొండ మహాంకాళీ బోనాలు షురూ.. ఈసారి సింపుల్‌గానే..

Golkonda Mahankali Bonalu 2020: గోల్కొండ మహాంకాళీ బోనాలు షురూ.. ఈసారి సింపుల్‌గానే..
x
Highlights

Telangana Bonalu 2020: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది ఆషాఢమాసంలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు ఈ రోజు గోల్కొండలో ప్రారంభమయ్యాయి.

Golkonda Mahankali Bonalu: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది ఆషాఢమాసంలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు ఈ రోజు గోల్కొండలో ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా మొదటిరోజున బోనాలు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా అమ్మవారి ఆలయంలో ప్రారంభం అవుతాయి. ఆ తరువాత సికింద్రాబాద్‌, పాతబస్తీతో సహా ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. 9రోజుల పాటు నిర్వహించే ఈ బోనాలు ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై అన్ని ప్రాంతాల్లో జరుపుకున్న అనంతరం చివరకు ఇక్కడే ముగుస్తాయి.

ఇక ఈ ఏడాది కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో బోనాల జాతరను నిరాడంబరంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే గురువారం లంగర్‌హౌస్‌లో అమ్మవారి చిత్రపటం, తొట్టెలకు పూజలు నిర్వహించారు. ఆ తరువాత గోల్కొండ ఛోటాబజార్‌లోని పూజారి అనంతాచారి ఇంటికి లంగర్ హౌజ్ నుంచి తొట్టెలను తీసుకువస్తారు. ఆ తరువాత వారు అక్కడే తొట్టెలకు, అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అమ్మావారు పూజలు అందుకున్న అనంతరం అమ్మవారి విగ్రహాన్ని తొట్టెలతోపాటు కోటపైన ఉన్న ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి మహేందర్‌కుమార్‌ తెలిపారు.

ఇక ఈ సారి నిర్వహించే ఉత్సవాలకు కేవలం 10 మంది పోలీసులు మాత్రమే అనుమతించారు. ఆలయ పూజారి, దేవాదాయశాఖ అధికారులు, ఆలయ వృత్తిపనివారు బోనాలను నిర్వహిస్తారు. అంతే కాదు ఈ సంవత్సరం ఊరేగింపు, డప్పువాయిద్యాలు, బ్యాండు మేళాలు, పోతురాజుల నృత్యాలు లేకుండా బోనాల పండగ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఉదయం 8 గంటలకు పూజాకార్యక్రమాలు ఆరంభంకాగా మధ్యాహ్నం 12 గంటల్లోపు అమ్మవారి విగ్రహాన్ని ఆలయానికి తరలించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories