జిల్లాల్లో పార్టీ బలోపేతంపై టీఆర్ఎస్ దృష్టి

జిల్లాల్లో పార్టీ బలోపేతంపై టీఆర్ఎస్ దృష్టి
x
Highlights

తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏక కాలంలో పార్టీ కార్యాలయాల...

తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏక కాలంలో పార్టీ కార్యాలయాల శంఖుస్థాపన చేయబోతుంది. పార్టీ కార్యాలయాల భూమి పూజా కార్యక్రమ నిర్వాహణ కోసం జిల్లాల వారీగా పార్టీ ప్రతినిధులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మంత్రులు మంత్రులు లేని ప్రాంతాల్లో కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి భూమి పూజ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ర్టంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల సొంత భవనాలకు సోమవారం శంఖుస్థాపన చేయనున్నారు. ఒక్కో జిల్లాకు ఎకరం చొప్పున భూమి కేటాయించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 34 జిల్లాలలకు గాను ఖమ్మంలో గతంలోనే పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ గత ఏడాది డిసెంబర్ 20న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మంత్రులు.. మంత్రులు లేని చోట్ల జిల్లా పరిషత్ చైర్మన్లు పార్టీ కార్యాలయాలకు భూమి పూజ చేయనున్నారు. జిల్లాలా వారీగా చూసినట్లయితే కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్, నిర్మల్ లో అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ లో వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్, జనగామలో ఎర్రబెల్లి దయాకర్ రావు, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి, మేడ్చల్ లో మల్లారెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ కార్యాలయాలకు శంఖు స్థాపన చేస్తారు.

ఇక మంత్రులు లేని చోట్ల ఆసిఫాబాద్ లో కోవాలక్ష్మి, మంచిర్యాల – భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్- జనార్దన్ రాథోడ్, కామారెడ్డి- ధాపేధార్ శోభ, సిరిసిల్ల- అరుణ, పెద్దపల్లి- పుట్టమధు, జయశంకర్ భూపాలపల్లి- శ్రీహర్షిణి, మహబూబాబాద్- అంగోత్ బిందు, ములుగు- కుసుమ జగదీష్, భద్రాద్రి కొత్తగూడెం- కోరం కనకయ్య, , నల్లగొండ- బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి- సందీప్ రెడ్డి, సిద్దిపేట-రోజా శర్మ, మెదక్-హేమలత, సంగారెడ్డి- మంజుశ్రీ, రంగారెడ్డి-తీగల అనితా రెడ్డి, వికారాబాద్- పట్నం సునీతా మహేందర్ రెడ్డి, నారాయణపేట- వనజ, నాగర్ కర్నూల్ జిల్లాలో పద్మావతి, వరంగల్ అర్బన్ -సుధీర్ కుమార్ శంకుస్థాపన చేయనున్నారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి అన్ని విధాలుగా పార్టీ సహకరిస్తుందన్నారు పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక జిల్లాలవారీగా ఏ రోజుకు ఆరోజే వివరాలన్నింటిని తెప్పించి డిజిటలైజ్ చేయలాని కూడా టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 27 న పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories