బాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్నిప్రమాదం

బాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్నిప్రమాదం
x
Highlights

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అకడమిక్‌ బ్లాక్‌ ఏబీ 1 లో ఒక్క సారిగా షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంతో ఏబీ-1 బ్లాక్ లోని ఫర్నీచర్, ప్రొజెక్టర్, కుర్చీలు, టేబుల్స్ పూర్తిగా దగ్ధమవ్వడంతో క్యాంపస్ పూర్తిగా పొగతో కమ్మేసింది. ఈ విషయం గ్రహించిన అధికారులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపకసిబ్బందికి సమాచారమందించారు. విషయం తెలుసుకున్న భైంసా అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు.

ఇక ఇప్పటికే బాసర ట్రిపుల్ ఐటీలో రెండు సార్లు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, రెండు నెలల నుంచి స్విచ్ లు ఆఫ్ చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories