మద్యానికి బానిసైన తండ్రి.. పిల్లల చేత ఏం చేయించాడో తెలుసా..?

మద్యానికి బానిసైన తండ్రి.. పిల్లల చేత ఏం చేయించాడో తెలుసా..?
x
Highlights

మద్యానికి బానిసైన వారు ఎంతటిపనికైనా తెగిస్తారని తెలుసు. మద్యం కోసం ఏం పనిచేయడానికైనా వెనకాడరు.

మద్యానికి బానిసైన వారు ఎంతటిపనికైనా తెగిస్తారని తెలుసు. మద్యం కోసం ఏం పనిచేయడానికైనా వెనకాడరు. సనిమాలలో ఎలాగైతా తల్లిలేని పిల్లలను రోడ్లపైన భిక్షాటన చేయించి కొంత మంది తమ అవసరాలను తీర్చుకుంటారో అచ్చం అలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో కూడా చోటు చేసుకుంది. కన్నతండ్రి తాగుడుకు బానిసై తన పిల్లల చేత భిక్షాటన చేయిస్తున్నాడు. వచ్చిన డబ్బులతో మద్యం సేవించి రోడ్లపై తిరుగుతున్నాడు. ఈ విధంగా ఆ చిన్న చిన్న పిల్లల బంగారు భవిష్యత్తులను చిదిమేస్తున్నాడు.

పూర్తివివరాల్లోకెళితే ఉప్పుగూడ క్రాంతినగర్‌కు చెందిన బి.ప్రభాకర్‌కు ఇద్దరు కొడుకు లు. ఇతని భార్య కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి ఇతను మద్యానికి బానిసయ్యాడు. ఏం పనిచేయకపోవడంతో అతనికి మద్యం తాగడానికి డబ్బులు లేకపోవడంతో పెద్ద కొడుకు వినయ్‌ (8), చిన్న కొడుకు శ్రీశైలం(6)లతో భిక్షాటన చేయిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ విధంగా చేస్తుండడంతో శ్రీ చైతన్య యూత్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డి.సుశీల్‌కుమార్‌, భాస్కర్‌, సి.విజయ్‌ కుమార్‌, మహేందర్‌ ఈ విషయం పై ఆరాతీసారు.

అనంతరం నాంపల్లిలోని చైల్డ్‌హెల్ప్‌ లైన్‌ హోం సభ్యులకు సమాచారం అందించి శ్రీశైలం(6)ను వారికి అప్పగించారు. దీంతో చైల్డ్‌హెల్ప్‌ లైన్‌ హోం సభ్యులు సైఫ్‌వుద్దీన్‌, విజయలక్ష్మీలు ఆ బాలుడిని తీసుకుకెళ్లి మొగల్‌పురా పోలీసులకు సమాచారం అందించి హోం కు తరలించారు. ఇదే కోణంలో భిక్షాటన చేస్తున్న అతని అన్న వినయ్‌ ఉప్పుగూడలో గుర్తించి ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. తరువాత ఈ చిన్నారిని కూడా హోం కు తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories