దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి : విచారంలో కుటుంబ సభ్యులు

దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి : విచారంలో కుటుంబ సభ్యులు
x
Highlights

గతేడాది జరిగిన దిశ అత్యాచారం హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే.

గతేడాది జరిగిన దిశ అత్యాచారం హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే. దాంతో వారి కుటుంబాలన్నీ విషాదంలో మునిగిపోయాయి. ఆ బాధనుంచి బయటికి రాకముందే నిందితుల్లో ఒకరైన చెన్నవేశవులు కుటుంబంలో మరో విషాదం సోమవారం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకెళితే హత్య కేసులో 4గా ఉన్న చెన్న కేశవులు తండ్రి కుమరయ్య సోమవారం మధ్యాహానం తన ఇంట్లో మృతిచెందారు. చెన్నకేశవులు అంత్యక్రియలు జరిగిన వారం రోజుల్లోనే నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో కుమరయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. బైక్‌పై వెళ్తున్న కురుమయ్యను ఇన్నోవా వాహనం అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో స్థానికులు తీవ్రగాయాలపాలైన ఆయన్ని హుటాహుటిన మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ అతని పరిస్థితి విషమించడంతో ఆయన్ని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

ఈ ప్రమాదంలో కురుమయ్య కుడికాలు విరిగిపోయిందని వైద్యుల వెల్లడించారు. కాగా కొన్నిరోజుల పాటు ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొంది ఆ తరువాత కురమయ్య ఇంటికి వచ్చాడు. ఇక చెన్నకేశవులు చనిపోయినప్పుడు అతని భార్య రేణుక గర్భవతిగా ఉంది. కాగా రెండు రోజుల క్రితమే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కురమయ్య మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గుడిగండ్ల వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories