మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం...

మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం...
x
Representational Image
Highlights

మంచిర్యాల జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపింది.

మంచిర్యాల జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పూర్తివివరాల్లోకెళ్తే మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం రాపెళ్లి గ్రామానికి చెందిన కొంత మంది బతుకుదెరువుకోసం ముంబయికి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో ముంబయి వలస కూలీలు మే 5వ తేదీన స్వస్థలాలకు తిరిగివచ్చారు.

దీంతో హాజీపూర్ పోలీసులు మందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని హోం క్వారంటైన్‌ చేశారు. కాగా వారిలో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు. ఆతరువాత వారి నుంచి వారి శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలు పంపించారు. కాగా శనివారం రాత్రి వచ్చిన ఫలితాల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని రావడంతో వారిని అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మూడు కేసులతో మళ్లీ మంచిర్యాల జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories