గవర్నర్‌ తమిళిసై ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

గవర్నర్‌ తమిళిసై ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు
x
కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియు ఇతర నాయకులు
Highlights

తెలంగాణ గవర్నర్ తమిళి సై ని కాంగ్రెస్ నేతలు శనివారం కలిసారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు దిశ హత్యా ఉందంతం గురించి గవర్నతో సంభాషించారు.

తెలంగాణ గవర్నర్ తమిళి సై ని కాంగ్రెస్ నేతలు శనివారం కలిసారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు దిశ హత్యా ఉందంతం గురించి గవర్నతో సంభాషించారు. దేశ వ్యా్ప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాల గురించి ఆమెతో మాట్లాడారు. ఇలాంటి నేరాలు రాష్ట్రంలో జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న మద్యం అమ్మకాలను నియంత్రించాలని గవర్నర్ ను కోరారు.

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే దిశ చనిపోయేది కాదంటూ, ఇంతటి దారుణం జరిగేది కాదంటూ భట్టి విక్రమార్క పోలీసులకు విమర్శించారు. రాష్ట్రంలో రోజు రోజుకూ ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయంటూ మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. ఎక్కడ చూసినా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడి మద్యం దుకాణాలు పెరిగిపోతున్నాయన్నాయని. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచేవిధంగా కాకుండా రెగ్యులేటేడ్‌ మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజల భద్రత కోసం వినియోగించాల్సిన పోలీసులను తెలంగాణ ప్రభుత్వంలోని నేతలు ఉపయోగించుకుంటున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇప్పటికైనా మహిళల పట్ల రక్షణ చర్యలను తీసుకోవాలని కోరారు. మహిళల పై జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories