నాన్న.. అమ్మెక్కడ...

నాన్న.. అమ్మెక్కడ...
x
Highlights

ప్రతి రోజు ఉదయాన్నే లేచి పిల్లలను తయారు చేసి, వాళ్లకి గోరు ముద్దలు పెట్టి తానే స్వయంగా స్కూల్ కి పంపించే అమ్మ కనపడడం లేదు.

ప్రతి రోజు ఉదయాన్నే లేచి పిల్లలను తయారు చేసి, వాళ్లకి గోరు ముద్దలు పెట్టి తానే స్వయంగా స్కూల్ కి పంపించే అమ్మ కనపడడం లేదు. అసలు ఏం జరిగింది? మా అమ్మ ఎటు వెళ్ళింది? ఎందుకు ఇంకా ఇంటికి రావడంలేదంటూ పిల్లలు అందరినీ అడుగుతున్నారు. వారు అడిగే ప్రశ్నలకు ఎం సమాధానం చెప్పాలో తెలియక ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. రోజు సాయంత్రం పిల్లలు రాగానే వాళ్ళ ఆలనా పాలనా చూసుకునే అమ్మ ఇక లేదు, రాదు అని ఎలా చెప్పాలో తెలీక ఆ తండ్రి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. అతనే కాదు వాళ్ళ బందువులు, ఆ చుట్టు పక్కన వుండే వాళ్ళంతా ఆ పిల్లల్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

అబ్దుల్లాపూర్ మెట్ లో తహసిల్దార్ విజయారెడ్డికి ఇద్దరు పిల్లలు కూతురు చైత్ర (10), కొడుకు భువనసాయి (5). పాపం ఇప్పటి వరకు వాళ్ళ తల్లి చనిపోయిందన్న విషయం కుడా ఆ పిల్లలకు తెలీదు. ఇప్పటికీ వారి తల్లి ఇంటికి ఎప్పుడొస్తుందో అని ఇంటికొచ్చిన వారి బంధువులను, వాళ్ళ తండ్రిని అడుగుతూనే వున్నారు. వాళ్ళ తల్లి ఇంకా ఇంటికి రావడం లేదంటూ, అమ్మ కావాలంటూ తల్లడిల్లుతునారు. ఆ పిల్లలకు కడసారి చుపులకైనా చూడడానికి వీలు లేకుండా ఆ తల్లిని పొట్టన పెట్టుకున్నాడు. కాగా, విజయారెడ్డి అంత్యక్రియలను మంగళవారం అత్తగారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లిలో నేడు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. ఒక్కసారైనా ఆ పిల్లలు తమ తల్లిని చూసే అవకాశం వుందో లేదో చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories