నిజామాబాద్ లో ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా బహిరంగ సభ

నిజామాబాద్ లో ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా బహిరంగ సభ
x
అసదుద్దీన్‌ ఓవైసీ, వేముల ప్రశాంత్‌రెడ్డి
Highlights

ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందడంతో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందడంతో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌లో యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో

ఖిల్లా ఈద్గా మైదానంలో సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశం ఏర్పాట్ల గురించి గురువారం మధ్యాహ్నం ఖిల్లా రోడ్డులోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్‌ మహ్మద్‌ రహీం అన్సారీ, యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మునీరుద్దీన్‌ ముక్తార్, జిల్లా కన్వీనర్‌ హఫిజ్‌లయాఖ్‌న్, మౌలానా వరియుల్లాఖాన్సి, పెద్ది వెంకట్రాములు, భూమయ్య, రఫత్‌ఖాన్‌ పాల్గొని మాట్లాడారు.

భారీ ఎత్తున నిర్వహించే ఈ సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తారని నిర్వహకులు తెలిపారు. ఎన్పీఆర్‌ను కూడా తాము వ్యతిరేకిస్తున్నమని వారు తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీలను అంగీకరించే ప్రసక్తే లేదని స్ఫష్టం చేసారు. ఈ సభకు బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీలతో పాటు ముస్లిం సంస్థల ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు రానున్నట్లు చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories