జనగామలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు : ఆరుగురి అరెస్ట్

జనగామలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు :  ఆరుగురి అరెస్ట్
x
Highlights

వ్యభిచార రాకెట్టు నడుపుతున్నారనే సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో వ్యబిచార ముఠాలు ఎక్కువై పోవడంతో పోలీసుల కూడా వారిపై నిఘా పెంచుతున్నారు. దీంతో వ్యభిచారం చేసేవారు ఇప్పుడు కొత్త దారులను, కొత్త ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి ఉద్యోగం కోసం పట్టణాలకు వచ్చిన యువతులను మాయ మాటలు చెప్పి, వారిని నమ్మించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి అమాయక యువతులను వ్యబిచార వృత్తిలోని దించుతున్నారు. మరి కొంత మంది ఈసీమని కోసం ఈ వృత్తిలోకి దిగుతున్నారు.

ఇలాంటి సంఘటనే జనగామలో ఇప్పుడు బయటికి వచ్చింది. వ్యభిచార రాకెట్టు నడుపుతున్నారనే సమాచారం రావడంతో పోలీసులు ఓ ఇంటిపై దాడులు నిర్వహించి ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

సీఐ మల్లెష్ యాదవ్ తెలిపిన వివరాల్లోకెళితే నిర్వాహకులు జిల్లాలోని యశ్వంత్ పూర్ రోడ్ వద్ద ఒక ఇంటిని ఫ్యామీలీతో ఉంటామని అద్దెకు తీసుకున్నారు. హైదరాబాద్, రాజమండ్రి నుంచి యువతులను తీసుకొచ్చి వ్యబిచారాన్ని నడిపిస్తున్నారు. ఈ విషయం గురించిన సమాచారం రావడంతో పోలీసులు రైడ్ చేసి అక్కడున్న వారిని అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్‌కు పంపారు. అరెస్ట్ చేసిన వారిలో హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన కీర్తి మల్లీశ్వరి, మల్కాజిగిరికి చెందిన బి సుజాత, జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన గాదె జశ్వంత, కొడవటూరు గ్రామానికి చెందిన మణిపురం బుచ్చమ్మలు ఉన్నారు. విటులను ఎ అంజనేయులు, జి నరేంద్రలుగా గుర్తించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories