గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
x
Highlights

నగరంలోని యువకులనే లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ వద్ద ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన...

నగరంలోని యువకులనే లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ వద్ద ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే అశోక్ నగర్, నెహ్రూ నగర్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారన్నారు.

వారిపైన పోలీసులకు అనుమానం రావడంతో ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి టాటా టియాగో వాహనాన్ని తనిఖీ చేశామని తెలిపారు. వారి కారులో 22 కిలోల గంజాయి లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు గంజాయిని, వారి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను, వారి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అరెస్టయిన వారిలో వెంకటేష్ (24) నారాగణి నాగరాజు (28) ఉన్నారని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories