ఆసీస్తో జరుగుతున్న మూడోటెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్మెన్ ను పూర్తిగా నిలువరించే...
ఆసీస్తో జరుగుతున్న మూడోటెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్మెన్ ను పూర్తిగా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. 399 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారత బౌలర్ల ధాటికి 135 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో కుదురుకుని అర్ధ శతకానికి చేరువైన షాన్ మార్ష్(44)ను బుమ్రా పెవిలియన్కు పంపాడు. 33వ ఓవర్ రెండో బంతికి షాన్ మార్ష్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 39 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మిచెల్ మార్ష్(10), పైన్ఉన్నారు. కాగా ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే మరో 264 పరుగులు చేయాలి. అలాగే భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire