బిగ్ బ్రేకింగ్ : మూడో వన్డేలో టీమిండియా గెలుపు

బిగ్ బ్రేకింగ్ : మూడో వన్డేలో టీమిండియా గెలుపు
x
Highlights

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. దాంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తో...

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. దాంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తో గెలుచుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 48.4 ఓవర్లలో 231 పరుగులు చేసింది. హాండ్స్ కంబు 58, షాన్‌ మార్ష్‌ 39, ఖవాజా 34, మ్యాక్స్‌వెల్‌ 26, రిచర్డ్‌సన్‌ 16, ఫించ్‌ 14, సిడిల్‌ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్‌ 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. భువనేశ్వర్‌, షమి రెండేసి వికెట్లు తీశారు. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 49.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. భారత ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని 87 పరుగులతో ఆదుకున్నాడు. జాదవ్(61), విరాట్ కోహ్లీ(46), ధ‌వ‌న్ (23) రాణించారు. మూడు వన్డేల సిరీస్ లో భారత్ రెండింటిలో గెలుపొందడంతో వన్డే సిరీస్ భారత్ వశమైంది. కాగా ఇదివరకే టెస్ట్ సిరీస్ ను సైతం టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories