ఇద్దరు క్రికెటర్లను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

ఇద్దరు క్రికెటర్లను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
x
Highlights

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌ను టీం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది. కాఫీ విత్ కరణ్ షోలో...

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌ను టీం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది. కాఫీ విత్ కరణ్ షోలో వీరిద్దరూ మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టిన బీసీసీఐ వారిని సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. మహిళలపై పాండ్యా, రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వీరిని రెండు వన్డేల నిషేధానికి సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో పాండ్యా, కేఎల్ రాహుల్ ఇంటిముఖం పట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories