సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ నేడు బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు.
సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ నేడు బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే బాబా ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. షిరిడీలోని సాయిబాబా ఆలయంలో ఇవాళ దర్శనాలు, పూజలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ట్రస్టు తెలిపింది. షిరిడీ గ్రామస్థులు, స్థానికులు చేపట్టిన బంద్ ప్రభావం ఆలయంపై ఉండబోదని ట్రస్టు సీయీవో దీపక్ ముగాలికర్ చెప్పారు. సంస్థాన్కు చెందిన ఆస్పత్రులు, ప్రసాద విక్రయ కేంద్రాలు, భక్తి నివాసాల కార్యకలాపాలు కొనసాగుతాయని ట్రస్ట్ ప్రకటించింది.
బంద్లో సుమారు 20 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. గతంలోనూ ఇలా బాబా జన్మస్థలంపై వివాదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నించారని షిర్డీ వాసులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాల్లో పాథ్రీ లోనిది ఒకటనీ, బాబా జన్మస్థానం పాథ్రీ అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. హోటళ్లలో బుకింగ్ చేసుకున్న భక్తులకు, విమానాల్లో వచ్చే భక్తులకు బంద్తో ఎలాంటి అసౌకర్యం ఉండదని చెప్పారు.
శ్రీ సాయి జన్మస్థలంపై తలెత్తిన వివాదం ముదిరింది. ఈ వివాదం పరిష్కారానికి సంబంధిత వర్గాలతో నేడు సెక్రటేరియట్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పాథ్రీ సాయిబాబా జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని షిర్డీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బంద్కు స్థానిక బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. పాథ్రీలో వసతుల కల్పనకు ఈ వివాదం ఆటంకం కారాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే త్వరలోనే ఓ సమావేశం నిర్వహించనున్నట్టు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. మరోవైపు, పాథ్రీ కృతి సమితి కూడా ఇవాళ్టి నుంచి పాథ్రీలో బంద్ పాటిస్తున్నట్లు వెల్లడించింది.
ఏటా లక్షలాది మంది దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు షిర్డీని సందర్శించుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా షిర్డీ సాయిబాబాను దర్శించుకోవాలని భావిస్తుంటారు. నిజానికి మతాలకతీతంగా సాయిబాబాను పూజిస్తారు. అయితే తాజాగా సాయిబాబా జన్మస్థలం ఏదనేది చర్చనీయాంశమైంది. ఊరు పేరునే తన పేరులో ఇముడ్చుకున్న సాయినాథుడి జన్మస్థలం అసలు షిర్డీయా..? లేక, పర్బనీ జిల్లాలోని పత్రియా..? అనే చర్చ జరుగుతోంది. కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరింది.
నిజానికి మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా లో ఉన్న పాథ్రీని కూడా ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. అయితే ఈ పట్టణం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. పాథ్రీ సాయినాథుడి దేవాలయాన్ని ఇటీవల సందర్శించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ పట్టణాభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయితే అహ్మద్నగర్ జిల్లాలోని షిర్డీ ప్రజలు దీనిపై అభ్యంతరం తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోన్న షిర్డీ ఆలయ ప్రాధాన్యం తగ్గుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
మరణానంతరం సాయిబాబాకు షిర్డీలోని బూటి వాడాలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, పత్రియే సాయి జన్మస్థలమనేందుకు ఆధారాలున్నాయని ఎన్సీపీ నాయకులు వాదిస్తున్నా రు. రామ్నాథ్ కోవింద్ సైతం ఇదే విషయాన్ని అంగీకరించినట్టు చెప్పుకొస్తున్నారు. పత్రిలోని సాయిబాబా దేవాలయాన్నీ, ఆ పట్టణాన్నీ అభివృద్ధి పరిస్తే, షిర్డీ ప్రాశస్త్యం తగ్గుతుందన్న ఆందోళనే ఈ వివాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
షిర్డీ సాయిబాబా 1835, సెప్టెంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని నిజాం రాష్ట్రంలోని పాథ్రీలో జన్మించారనీ, ఐదేళ్ల బాలుడిగా ఉండగా.. సాయిబాబాని ఓ ఫకీర్కి పిల్లలు లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చేసినట్టు సత్యసాయి బాబా (పుట్టపర్తి) చెప్పినట్టు చరిత్రకారులు దాస్గణు మహా రాజ్, గోవింద్ దబోల్కర్లు తమ పుస్తకంలో ప్రస్తావించారు.
మత సహన ప్రతీక..
ఆ రోజుల్లో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది. ఆ సందర్భంలో సాయిబాబా హిందూ దేవాలయాల్లోకి వెళ్లి ముస్లిం మత ప్రార్థనలు చేసేవారట. అలాగే ముస్లిం దేవాలయాల్లో హిందూ దేవతలను స్తుతిస్తూ గీతాలాలపించేవారట. దీంతో ఇరుమతాల వారు బాలుడిపై ఫకీరు భార్యకి ఫిర్యాదు చేసేవారు. ఈ బాలుడిని పెంచడం కష్టంగా భావించిన ఫకీరు భార్య సాయిబాబాని తమ పొరుగింట్లో ఉండే వెంకుశ అనే వ్యక్తికి అప్పగించారు. 1839 నుంచి 1851 వరకు ఈ బాలుడు వెంకుశ ఆశ్రమంలోనే గడిపాడు. సాయిబాబా 16 ఏళ్ల వయస్సులో షిర్డీకి వచ్చినట్టు చెబుతారు.
దాడులకు వెరవని ధీశాలి..
తనపై అనేక దాడులు జరిగినా చలించకుండా ఉండడం సాయి సహనానికి ప్రతీకగా భావిస్తారు. చిన్న వయస్సులోనే ఆహారం, నీరు లేకుండా రోజుల తరబడి వేపచెట్టుకింద కూర్చుని ధ్యానం చేస్తోంటే జనం విస్తుపోయేవారని అంటారు. ప్రజలపై ఆయనకున్న ప్రేమ, ఔదార్యం, ఆయన భాష్యాలూ జనాన్ని ఎంతగానో ఆకర్షించేవి. క్రమంగా హిందూ ముస్లింలకు సాయిబాబా ఆరాధ్యులుగా మారారు.
కర్మభూమి షిర్డీ.. జన్మభూమి పత్రి
మరణానంతరం సాయిబాబాకు షిర్డీలోని బూటి వాడాలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, పత్రియే సాయి జన్మస్థలమనేందుకు ఆధారాలున్నాయని ఎన్సీపీ నాయకులు వాదిస్తున్నా రు. రామ్నాథ్ కోవింద్ సైతం ఇదే విషయాన్ని అంగీకరించినట్టు చెప్పుకొస్తున్నారు. పత్రిలోని సాయిబాబా దేవాలయాన్నీ, ఆ పట్టణాన్నీ అభివృద్ధి పరిస్తే, షిర్డీ ప్రాశస్త్యం తగ్గుతుందన్న ఆందోళనే ఈ వివాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire