అందుకే టీడీపీని వీడి బీజేపీలో చేరా: రేవూరి

అందుకే టీడీపీని వీడి బీజేపీలో చేరా: రేవూరి
x
Highlights

బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యం లో బుధవారం దిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యం లో బుధవారం దిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. బిజెపిలో చేరిన నేత రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు టీడీపీపైనా, పార్టీ అధినేత నారా చంద్రబాబుపైనా ఎలాంటి కోపం కానీ ,వ్యతిరేకత కానీ లేవని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ మీద ఆంధ్ర పార్టీ అని ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరింది రాజకీయ పునరేకీకరణ కోసమేనని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ చాలా అవసరమని, కెసిఆర్ ని ధీటుగా ఎదుర్కోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రేవూరి ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories