ఇక వాహనాలపై కులం పేర్లు ఉండొద్దు..

ఇక వాహనాలపై కులం పేర్లు ఉండొద్దు..
x
Highlights

మోటారు వాహన చట్టం అమలులో భాగంగా.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన వారికి రూ. 1000 జరిమాన విధించి.. అదే పైసలతోటి ఫ్రీగా హెల్మెట్ అందించాలని రాజస్థాన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే.

మోటారు వాహన చట్టం అమలులో భాగంగా.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన వారికి రూ. 1000 జరిమాన విధించి.. అదే పైసలతోటి ఫ్రీగా హెల్మెట్ అందించాలని రాజస్థాన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా మరో వినూత్న నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ సర్కార్. ఇక నుంచి వాహనాలపై కులం పేర్లతో పాటు గ్రామం పేరుగానీ..ఆయా పార్టీలకు సంబంధించిన నినాదాలు కానీ ఉండటానికి ఛాన్స్ లేనే లేదంటూ.. ఆదేశాలు జారీ చేశారు.

కులం, వృత్తులు, సంస్థలు, హోదాలను వాహనాలపై ప్రదర్శించడం వల్ల సమాజంలో కులతత్వంతో పాటు బేధాభిప్రాయాలు పెరుగుతాయంటూ పౌర సమాజం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాసింది.ఇగ ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. వారి వారి కులాలు, వృత్తులు, సంస్థలు, హోదాలను వాహనాలపై ప్రదర్శించవద్దంటూ ఆదేశించారు. ఇది ఆఫీసు వాహనాలకే కాక వ్యక్తిగత వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే జోధ్‌పూర్, జైపూర్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు అందాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories